- Tuesday, May 18, 2010, 1:30
- State
- 50 views
రెండు నినాదాలు... జై తెలంగాణ, జై ఆంధ్ర! లక్ష్యం ఒక్కటే... రాష్ట్ర విభజన! ఈ లక్ష్యం కోసం ఉమ్మడి పోరాటం మొదలైంది. ఇప్పటిదాకా వేర్వేరుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర ఉద్యమ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. ఒకరి ప్రాంతాల్లో ఒకరు పర్యటించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాలకూ మేలు జరుగుతుందనే వాదన వినిపించనున్నారు.
Full story
- Friday, April 30, 2010, 4:15
- State
- 52 views
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆయన వర్గీయులు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. వైఎస్ హఠాన్మరణంతో ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి సీఎం పగ్గాలు అప్పగిస్తారని అందరూ ఊహించారు.
Full story
- Friday, April 30, 2010, 4:15
- State
- 52 views
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేదికపై ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు, మెదక్ ఎంపీ విజయశాంతిలు ఒకరిపై ఒకరు నర్మగర్భంగా విమర్శలు గుప్పించుకున్నారు. ఇది.. మిగిలిన పార్టీ నేతలకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. పక్కపక్కనే కూర్చొన్న కేసీఆర్, విజయశాంతిలు, తమ వంతు ప్రసంగాల సమయంలో ఒకరినొకరు దెప్పిపొడుచుకున్నారు. ఇది పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.
Full story
- Friday, April 30, 2010, 4:15
- State
- 47 views
సార్క సదస్సులో భాగంగా భూటాన్ రాజధాని థింపూలో భారత్, పాకిస్థాన్ దేశాల ప్రధానమంత్రుల మధ్య జరిగిన కీలక భేటీ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. ఇకపై ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ముంబై దాడుల నేపథ్యంలో ఈ చర్చలు ఆగిపోయిన విషయం తెల్సిందే.
Full story
- Friday, April 30, 2010, 4:15
- State
- 52 views
తెలంగాణ ఉద్యమం పేరుతో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు కోట్లాది రూపాయలు దండుకుని టీవీ ఛానల్ను పెట్టారని విజయవాడ ఎంపీ, సమైక్యాంధ్ర హీరో లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. హైదరాబాద్లో పోటీ చేసే సత్తా లేని కేసీఆర్.. దాడులు దందాలతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
Full story
- Friday, April 30, 2010, 4:15
- State
- 55 views
గూఢచర్య ఆరోపణలతో అరెస్టయిన దౌత్య కార్యదర్శి మాధురి గుప్తా వద్ద అధికారులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. శత్రుదేశ అధికారులు ఎర చూపిన డబ్బుతో పాటు తన పాకిస్థాన్ ప్రేమికుడి కోసం మాతృదేశ రక్షణ రహస్యాలను చేరవేసేందుకు సమ్మతించినట్టు ఆమె వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ గురువారం లోక్సభకు తెలియజేశారు.
Full story
- Friday, April 30, 2010, 4:14
- State
- 49 views
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు మతి భ్రమించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు.. పీసీసీ అధ్యక్షుడు దానం నాగేందర్పై అవాకులు చెవాకులు పేలడాన్ని దానం తప్పుబట్టారు.
Full story
- Friday, April 30, 2010, 4:14
- State
- 42 views
బాలీవుడ్లో తన అందచందాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన అందాల ముద్దుగుమ్మ సమీరారెడ్డికి సినీ ఫీల్డ్లో ఉన్న మగాళ్లంటే బొత్తిగా నచ్చదట. హీరోలు, మోడల్స్ అంటే అంతగా ఆసక్తి చూపనని, ముఖ్యంగా సినిమా నాయకులతో డేటింగ్ చేయడం అస్సలు నచ్చదని సమీరారెడ్డి ఓపెన్గా చెప్పేసింది. ఎందుకంటే..? తను కూడా సినిమావాడే కదా..? అందుకే బోర్ కొడుతుందని సమీరా మనసులోని మాటను బయటపెట్టేసింది. ఇంకా చెప్పాలంటే..? తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవని అంటోంది. ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతానంటే..? అందమైన మనసున్న అబ్బాయిలంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది. ఆత్మవిశ్వాసంతో బతికే మగాడంటే చాలా ...
Full story
- Friday, April 30, 2010, 4:14
- State
- 44 views
ప్రకాష్రాజ్, భూమిక జంటగా నటించిన "కలెక్టర్ గారి భార్య" చిత్ర ఆడియో విడుదల హైదరాబాద్లో జరిగింది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీడీని ఆవిష్కరించగా, మరో మంత్రి డి.కె. అరుణ ఆమోద్ ఆడియో లోగోను ఆవిష్కరించారు. ఆడియో విడుదల సందర్భంగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా టైటిల్ వినగానే తప్పకుండా చూడాలనేట్లుంది. మహిళా కథాంశాన్ని ఎంపిక చేసుకున్న దర్శకుడు కమిట్మెంట్, కసితో రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్లో కూడా నేను నా సహమంత్రి అరుణ పాల్గొనాలని కోరుకుంటున్నాను. చిత్రపరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ...
Full story
- Friday, April 30, 2010, 4:14
- State
- 48 views
ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 వార్మప్ మ్యాచ్ల్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు గెలుపును నమోదు చేసుకున్నాయి. కరేబియన్ గడ్డపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ట్వంటీ-20లో భాగంగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్ల్లో.. వెస్టిండీస్పై న్యూజిలాండ్ నెగ్గగా, శ్రీలంకపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. వెస్టిండీస్-న్యూజిలాండ్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే బ్రాండన్ మెక్కల్లమ్, వెట్టోరి, స్టైరిస్, గుప్తిల్ వంటి ఆరుగురు కీలక ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. దీంతో 37 పరుగులకే కివీస్ ఆరు వికెట్లు కోల్పోయింది.
Full story